Home

ఆర్థిక సంవత్సరం ముగియనుంది.. ఈ పనులు చేసేశారా?

Home > బిజినెస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్నుకు సంబంధించి పూర్తి చేయాల్సిన కొన్ని పనులుంటాయి. ఆ పనులేవీ.. వాటిని పూర్తి చేశారా? పరిశీలించుకోండి
Home > బిజినెస్‌

పన్ను మినహాయింపు లెక్కలు

ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయానికి ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో లెక్కలు వేసుకోవాలి. సెక్షన్‌ 80సీ కింద వర్తించే మినహాయింపులన్నీ వాడుకున్నారా? లేదా? చూసుకోండి.
Home > బిజినెస్‌

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, జాతీయ పింఛను పథకం, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఇలా అనేక పథకాల్లో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి పథకాన్ని ఎంచుకోండి.
Home > బిజినెస్‌

ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఎస్‌ఎస్‌వై పథకాల్లో.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే.. మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తమైనా పెట్టుబడి పెట్టాలి.
Home > బిజినెస్‌

రిటర్నుల దాఖలు..

గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21కి సంబంధించిన రిటర్నులు రుసుముతో సమర్పించేందుకు మార్చి 31 చివరి తేదీ. ఆ తర్వాత రిటర్నులను సమర్పించడం సాధ్యం కాదు.
Home > బిజినెస్‌

ఆధార్‌-పాన్‌ అనుసంధానం..

ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకూ గడువుంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి. గడువు దాటితే పాన్‌ చెల్లకుండా పోయే ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం కష్టమవుతుంది.
Home > బిజినెస్‌

బ్యాంకులో కేవైసీ..

మీ బ్యాంకు ఖాతాలో మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలను పూర్తి చేయండి. పాన్‌, ఆధార్‌, చిరునామా ధ్రువీకరణలాంటి వాటితోపాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలనూ మార్చి 31లోపు అందించాలి.
Home > బిజినెస్‌

వివాదాలుంటే..

‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకంలో భాగంగా ఏదైనా పన్ను బాకీ ఉంటే.. దానిని చెల్లించేందుకు మార్చి 31 వరకూ వ్యవధినిచ్చింది ఆదాయపు పన్ను విభాగం. ఇలా చెల్లించినప్పుడు వడ్డీతోపాటు, అపరాధ రుసుములనూ రద్దు చేస్తామని పేర్కొంది.