బర్మింగ్హమ్ వేదికగా ఇంగ్లాండ్- ఇండియా మధ్య జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ 378 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. టెస్ట్ చరిత్రలో టాప్ 10 అత్యధిక స్కోర్లు ఛేదించిన జట్లు ఇవే..
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య 2003 జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో శివ్నరైన్ చందర్పాల్ 104 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య 1948లో జరిగిన టెస్టు మ్యాచ్లో 404 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాడు సిరిల్ వాష్ బ్రూక్ 143 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
1976లో ఇండియా, వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన టెస్టులో ఇండియా 406 పరుగులను ఛేదించింది. ఈ మ్యాచ్లో గావస్కర్ 102, గుండప్ప విశ్వనాథ్ 112 పరుగులు చేశారు.
వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య 2021లో చిట్టగ్యాంగ్ మ్యాచ్లో వెస్టిండీస్ 395 పరుగులను ఛేదించింది. కైల్ మేయర్స్ 210 పరుగులతో ఈ మ్యాచ్లో సత్తా చాటాడు.
శ్రీలంక, జింబాబ్వే మధ్య.. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో 2017 జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు 391 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో రంగన్న హెరాత్ 11 వికెట్లతో సత్తా చాటాడు.
2008లో భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా 387 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో సచిన్ 103 పరుగులు చేశాడు.
2015లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ 377 లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. ఈ మ్యాచ్లో యూనిస్ఖాన్ 171 పరుగులతో సత్తా చాటాడు.