Home

చిత్రం చెప్పే విశేషాలు!

Home > న్యూస్‌

త్రిరాష్ట్ర కూడలి.. గుడుపల్లె మండల కేంద్రానికి సమీపంలోని శ్రీప్రసన్న రాళ్లగంగమాంబ బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కర్ణాటక రాష్ట్రం బంగారుపేట నియోజకవర్గం తనిమొడుగు గ్రామానికి చెందిన మహదేవన్, మంజుల దంపతులు హెలీకాప్టర్‌ ద్వారా అమ్మవారి రథంపై పుష్పాభిషేకం చేసి మొక్కు తీర్చుకున్నారు.
#Eenadu
Home > న్యూస్‌

బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బ్రహ్మరౌతు ధనలక్ష్మి పెంచిన కోడి కొన్ని రోజులుగా గుడ్లు పెడుతోంది. రోజు మాదిరిగానే శనివారం కోడిని గంప కింద మూశారు. కొంత సమయం తర్వాత చూడగా అతిచిన్న సైజు గుడ్డు పెట్టింది. స్థానికులు దాన్ని వింతగా చూశారు. జన్యుపరమైన సమస్యల వల్లే ఇలా చిన్నగా గుడ్లు పెడతాయని పశువైద్యాధికారి తెలిపారు.
#Eenadu
Home > న్యూస్‌

హనుమాన్‌ జయంతిని పురష్కరించుకుని శనివారం గజ్వేల్‌కు చెందిన రామకోటిభక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు రూ.21 వేల విలువైన నాణేలతో 20 అడుగుల హనుమాన్‌ చిత్రాన్ని గీసి తన భక్తిని చాటుకున్నారు. బల్దియా ఛైర్మన్‌ రాజమౌళి, పుర ప్రముఖులు అతడిని అభినందించారు.
#Eenadu
Home > న్యూస్‌

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన చిత్రకారుడు గుండు శివకుమార్‌ శనివారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని మర్రి ఆకులపై పెన్‌ కట్టర్‌తో పర్వతాన్ని తీసుకెళుతున్న హనుమంతుడి చిత్రాలను మలిచారు. తిలకించిన పలువురు ప్రముఖులు ఆయన్ను అభినందించారు.
#Eenadu
Home > న్యూస్‌

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని రామతీర్థం జనసంద్రమైంది. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన గంగమ్మ తిరునాళ్లకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వైకాపా, జనసేన తదితర పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభలు.. నృత్య ప్రదర్శనలు కట్టిపడేశాయి. ఈ వేడుకకు హాజరైన సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ అదరగొట్టేలా స్టెప్పులేసి సందడి చేశారు.
#Eenadu
Home > న్యూస్‌

విశాఖలోని కూర్మన్నపాలెం ప్రధాన రహదారిలో ఓ చెట్టు విరబూసిన పువ్వులతో అందరినీ ఆకట్టుకుంటోంది. స్థానిక సీడబ్ల్యూసీ రోడ్డు నుంచి కూర్మన్నపాలెం ప్రధాన రహదారిలోకి చేరుకునే కూడలిలో చల్లని నీడతో పాటు, ఆహ్లాదం పంచుతోంది.
#Eenadu
Home > న్యూస్‌

కరీంనగర్‌లోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్‌ చర్చిలో ఈస్టర్‌ డేను పురస్కరించుకొని ఈ తెల్లవారుజామున క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డాక్టర్‌ బాసీపాల్‌(తెలంగాణ ఆక్సిలరీ సెక్రటరీ, బైబిల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా) ఈస్టర్‌ పండగ సందేశాన్ని విశ్వాసులకు చదివి వినిపించారు. పాస్టరేట్‌ ఛైర్మన్‌, డయాసెసన్‌ మినిస్టీరియల్‌ సెక్రటరీ జి.శ్రీనివాసనాయక్‌, ప్రెస్బిటర్‌ మధుమోహన్‌, వర్జిర్‌ ఎస్‌.ప్రేమ్‌కుమార్‌లు పాల్గొన్నారు.
#Eenadu
Home > న్యూస్‌

అలంపూర్‌ నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ బోరవెల్లి గ్రామంలో ‘ప్రజల గోస.. భాజపా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు.
#Eenadu