బాలీవుడ్‌లోకి కొత్త వారసులు.. 

సినిమా రంగంలో వారసత్వం కొత్తేమీ కాదు.. తాజాగా బాలీవుడ్‌కు చెందిన మూడు పెద్ద కుటుంబాల నుంచి కొత్త వారసులు వస్తున్నారు.

Image:Pixabay

దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌, షారూఖ్ ఖాన్‌ తనయ సుహానా ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్యా నందా (శ్వేతాబచ్చన్‌ నందా

కుమారుడు) తెరంగేట్రానికి సిద్ధమయ్యారు.

Image:Instagram

ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్‌ ‘ది ఆర్చీస్‌’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ది ఆర్చీస్‌’ అనే కామిక్‌ పుస్తకం ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారు.

Image:Instagram

ఈ సినిమాలో కనిపించనున్న నటీనటుంలందరూ ఒకే దగ్గర కూర్చొని ఉన్న ఫొటోని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

Image:Instagram 

ఇందులో వెరోనికా పాత్రలో సుహానా కనిపించనుంది. ఆర్చీస్‌గా అగస్త్య, బెట్టీగా ఖుషి నటిస్తున్నారు.

Image:Instagram 

ఖుషీ కపూర్‌ సోదరి జాన్వీ కపూర్‌ ఇప్పటికే సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Image:Instagram

ఇటీవల ఖుషి సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌ అయింది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు పోస్టు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమెకు ఇన్‌స్టాలో 8.6లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Instagram 

మరోవైపు షారుఖ్‌ కుమార్తె సుహానా కూడా విదేశాలకు వెళ్లి మరీ నటనలో శిక్షణ తీసుకుంది.

Image:Instagram 

సినిమాల్లోకి రాకముందే సుహానాకి ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాలో ఆమెను 2.9మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

Image:Instagram

 అగస్త్యా నందా లండన్‌లో చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇతడికి ఆసక్తి. దీంతో చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.

Image:Instagram

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home