సరోగసీ ద్వారా బిడ్డల్ని కన్న తారలు!

తాజాగా నయనతార - విఘ్నేశ్‌ జంట సరోగసీ విధానంలో తల్లిదండ్రులయ్యారు. వారికంటే ముందు పలువురు సెలబ్రీటీలు ఈ విధానంలోనే పిల్లలకు జన్మనిచ్చారు. వారెవరంటే..

Image: Instagram

ప్రియాంక - నిక్‌ జోన్స్‌

కొన్ని నెలల కిందట ప్రియాంక, చోప్రా సరోగసి విధానంలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Image: Instagram

ప్రీతి జింటా - జీన్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రీతి జింటా దంపతులు కూడా ఇద్దరు పిల్లల్ని సరోగసీ విధానంలోనే కన్నామని గతేడాది వెల్లడించారు.

Image: Instagram


శిల్పాశెట్టి - రాజ్‌కుంద్రా

ఈ జంట 2020లో రెండో సంతానంగా అమ్మాయిని సరోగసీ ద్వారానే పొందింది.

Image: Instagram

సన్నీ లియోనీ - డానియెల్‌ వెబర్‌

వీరిద్దరూ 2017లో ఇద్దరు అబ్బాయిలకు సరోగసీ ద్వారానే తల్లిదండ్రులయ్యారు.

Image: Instagram

షారుక్‌ఖాన్‌ - గౌరీ ఖాన్‌

బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ దంపతులు కూడా 2013లో సరోగసీ విధానంలోనే అబ్‌రామ్‌కు జన్మనిచ్చారు.

Image: Instagram

ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావ్‌

ఆమిర్‌ దంపతులు 2011లో ఈ విధానంలోనే వారి కుమారుడు ఆజాద్‌ రావ్‌కు తల్లిదండ్రులుగా మారారు.

Image: Instagram

కరణ్‌ జోహర్‌

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ వివాహం చేసుకోలేదు. కానీ, 2017లో కవల పిల్లలకు సరోగసీ విధానంలో తండ్రయ్యాడు.

Image: Instagram

మంచు లక్ష్మి

టాలీవుడ్‌ నటి మంచు లక్ష్మి కూడా అద్దె గర్భంతో తల్లిగా మారింది. ఎనిమిదేళ్ల కిందట ఆమె విద్యా నిర్వాణకు ఈ విధానంలో జన్మనిచ్చింది.

Image: Instagram

ఏక్తా కపూర్‌

బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ కూడా 2019 జనవరిలో సరోగసీ ద్వారా మగ శిశువుకు తల్లిగా మారింది. ఏక్తా సోదరుడు తుషార్‌ కపూర్‌, నటుడు శ్రేయాస్‌ తల్పడే వంటి పలువురు సెలబ్రిటీలూ ఈ విధానాన్నే ఎంచుకున్నారు

Image: Instagram

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

దర్శకుల గురించి తారక్‌ సూపర్‌ మాటలు!

Eenadu.net Home