మీనాక్షి.. ‘గుంటూరు కారం’తో రెడీ!
‘గుంటూరు కారం’తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది మీనాక్షి చౌదరి. మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రమిది. జనవరి 12న విడుదలకు సిద్ధమైంది.
ఇందులో ఈమె ‘రాజీ’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్లుగా చిత్రబృందం పూజాహెగ్డే, శ్రీలీలను ఎంపిక చేసింది.
అనివార్య కారణాల వల్ల పూజాహెగ్డే ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లడంతో ఆమె స్థానంలో శ్రీలీల నటించింది. రెండో నాయికగా మీనాక్షి ఎంపికైంది.
‘మీనాక్షి అప్పుడే ఫుల్ బిజీ అయిపోయింది. ఎప్పుడైనా డేట్స్ ఇస్తే మా సినిమాలోకి తీసుకుంటాం’ అని త్రివిక్రమ్ 2021లో ఓ ఈవెంట్లో సరదాగా అన్నారు. కట్చేస్తే, ‘గుంటూరు కారం’తో నిజమైంది.
‘గుంటూరు కారం’ సెట్స్లోకి వెళ్లిన తొలిరోజే మహేశ్తో షూటింగ్ అనగానే టెన్షన్ పడిందట. ఆ సమయంలో సపోర్ట్ చేసినందుకు హీరోపై ఓ సందర్భంలో ప్రశంసలు కురిపించింది.
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. ‘ఖిలాడి’, ‘హిట్ 2’ చిత్రాల్లోనూ నటించింది. ‘కొలై’ (తెలుగులో హత్య)తో కోలీవుడ్లో అడుగుపెట్టింది.
ప్రస్తుతం ఈ భామ.. ‘మట్కా’, ‘లక్కీ భాస్కర్’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, ‘వీఎస్ 10’ (వర్కింగ్ టైటిల్) తదితర చిత్రాల్లో నటిస్తోంది.
కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలనే నియమం పెట్టుకుంది. అశ్లీల సీన్స్లో కనిపించకూడదని నిర్ణయించుకుని, ఎన్నో అవకాశాలను తిరస్కరించింది.
మీనాక్షి స్వస్థలం హరియాణాలోని పంచ్కులానీ. ‘నటి మీనాక్షి శేషాద్రికి మా నాన్న వీరాభిమాని. అందుకే నాకు ఆ పేరు పెట్టారు’ అని ఓ సందర్భంలో చెప్పింది.
‘నాన్న లేరనే బాధ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చేందుకు అమ్మ చాలా కష్టపడింది. ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొనమని దరఖాస్తు చేసింది. చుట్టు పక్కలవారు, బంధువులు విమర్శించినా అమ్మ నన్ను పోత్సహించింది’ అని తెలిపింది.
బీడీఎస్ చదువుతూనే.. మోడలింగ్ చేసేది. అలా ‘ఔట్ ఆఫ్ లవ్’ వెబ్సిరీస్లో నటించే అవకాశం వచ్చింది. యూట్యూబ్లో చూసి క్యాట్వాక్ నేర్చుకుంది. ఫెమినా మిస్ ఇండియా హరియాణా విజేతగా (2018) నిలిచింది.
‘బీడీఎస్ పూర్తి చేసి డాక్టర్ మీనాక్షి అనిపించుకున్నా. మిస్ ఇండియా పోటీలకూ వెళ్లా. ఐఏఎస్ కావాలనే కోరిక మాత్రం అలానే ఉంది. ఏదో ఒక సినిమాలో కలెక్టర్గా కనిపించి ఆనందిస్తా’ అని అంటోంది.