T20 World Cup: ఎక్కువ రన్స్‌ చేసిన 

టీమ్‌ఇండియా క్రికెటర్స్‌   

రోహిత్‌ శర్మ 


టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో ఆడాడు. 847 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Image:RKC

విరాట్‌ కోహ్లీ 


భారత మాజీ సారథి విరాట్‌ కోహ్లీ 21 మ్యాచ్‌ల్లోనే 845 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

Image:RKC

యువరాజ్‌ సింగ్‌ 


టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 31 మ్యాచ్‌ల్లో 593 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.

Image:SocialMedia 

ఎం.ఎస్‌.ధోనీ 


భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ పొట్టి ప్రపంచకప్‌లో 33 మ్యాచ్‌లు ఆడాడు. 35.26 సగటుతో 529 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.

Image:RKC

గౌతమ్‌ గంభీర్‌ 


భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్ టీ20 ప్రపంచకప్‌లో 21 మ్యాచ్‌ల్లో 524 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉన్నాడు.

Image:RKC

సురేశ్ రైనా

 

టీమ్ఇండియా మాజీ ప్లేయర్‌ సురేశ్ రైనా 26 మ్యాచ్‌ల్లో 453 పరుగులు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ బాదిన ఏకైక భారత క్రికెటర్‌ రైనాయే.

Image:RKC

కేఎల్ రాహుల్‌


భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 194 పరుగులు చేశాడు. రాహుల్‌ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు.

Image:RKC

 వీరేంద్ర సెహ్వాగ్‌ 


టీమ్‌ఇండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పొట్టి ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడాడు. 187 పరుగులతో వీరూ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

Image:SocialMedia

IND vs BAN.. ఎప్పుడు, ఎక్కడ, ఎందులో?

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌!

దులీప్‌ ట్రోఫీ.. బౌలింగ్‌తో దుమ్ముదులిపేశారు!

Eenadu.net Home