ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? 

‘రన్‌ రాజా రన్‌’లో శర్వానంద్‌ సరసన నటించిన హీరోయినే. పేరు.. సీరత్‌ కపూర్‌.

Image: Instagram/Seerat Kapoor

‘టైగర్‌’, ‘రాజు గారి గది 2’, ‘ఒక్క క్షణం’ తదితర చిత్రాల్లోనూ నటించింది.

Image: Instagram/Seerat Kapoor

ఆ మధ్య సర్జరీలు చేయించుకోవడంతో ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Image: Instagram/Seerat Kapoor

గత మూడేళ్లుగా సీరత్‌ తెలుగు సినిమాల్లో నటించట్లేదు. చివరగా 2020లో ‘మా వింత గాథ వినుమా’లో కనిపించింది. 

Image: Instagram/Seerat Kapoor

గతేడాది హిందీలో ‘మారిచ్‌’ అనే క్రైమ్‌ థ్రిల్లర్‌లో సీరత్‌ నటించింది.

Image: Instagram/Seerat Kapoor

అడపాదడపా సినిమాలు చేస్తూనే.. డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

Image: Instagram/Seerat Kapoor

ముంబయిలో పుట్టి పెరిగిన సీరత్‌ మంచి డ్యాన్సర్‌. చదువు పూర్తి కాగానే బాలీవుడ్‌లో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది. 

Image: Instagram/Seerat Kapoor

మోడలింగ్‌లోనూ అడుగుపెట్టి.. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకుంది. 2014లో బాలీవుడ్‌లో ‘జిద్‌’తో.. టాలీవుడ్‌లో ‘రన్‌ రాజా రన్‌’తో తెరంగేట్రం చేసింది.

Image: Instagram/Seerat Kapoor

యూత్‌ను సీరత్‌ ఆకట్టుకోవడంతో తెలుగులోనే అవకాశాలు బాగా వచ్చాయి. మొత్తం 8 సినిమాల్లో నటించింది. 

Image: Instagram/Seerat Kapoor

ఎంతో అందంగా కనిపించే సీరత్‌.. సర్జరీలు చేయించుకోవడంతో ముఖం మారిపోయింది. 

Image: Instagram/Seerat Kapoor

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సీరత్‌.. తరచూ తన గ్లామర్‌ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Image: Instagram/Seerat Kapoor

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

Eenadu.net Home