సోషల్ మీడియా హాట్ టాపిక్.. లారిస్సా బొనేసి!
అప్పుడెప్పుడో తెలుగు తెరపై మెరిసిన బ్రెజిల్ భామ లారిస్సా బోనేసి.. తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
Image: Instagram/Larissa Bonesi
సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ‘హ్యాపీ బర్త్డే మై తేజు’ అంటూ ట్వీట్ చేసింది. దానికి సాయి ధరమ్ కూడా ‘నన్ను ఎప్పుడూ డిస్ట్రబ్ చేసే వ్యక్తి’ అని థాంక్స్ చెప్పాడు.
Image: Instagram/Larissa Bonesi
దీంతో మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? అని నెటిజన్లు వారిని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ లారిస్సా ఎవరంటే..
Image: Instagram/Larissa Bonesi
సాయిధరమ్ హీరోగా 2016లో విడుదలైన ‘తిక్క’ చిత్రంలో నటించింది లారిస్సా.
Image: Instagram/Larissa Bonesi
సినిమా పూర్తయినా మా మధ్య స్నేహం కొనసాగుతోందని సాయి పలు సందర్భాల్లో వెల్లడించాడు.
Image: Instagram/Larissa Bonesi
కాగా, ఇప్పుడు ఆమె ‘మై తేజు’అని ట్వీట్ చేయడంతో వారి మధ్య ఉన్నది స్నేహం కాదు.. ప్రేమ అని నెట్టింట్ట చర్చ జరుగుతోంది. Image:Instagram/Larissa Bonesi
లారిస్సా.. మార్చి 28, 1990న బ్రెజిల్లో జన్మించింది. అక్కడే చదువుపూర్తి చేసుకుంది. అనందరం ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి.. మోడల్గా కెరీర్ ప్రారంభించింది.
Image:Instagram/Larissa Bonesi
భారతీయ చిత్రాల్లో నటించాలన్న కోరికతో ముంబయికి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో పలు బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లోనూ నటించింది.
Image: Instagram/Larissa Bonesi
బాలీవుడ్లో 2011లో తెరకెక్కిన ‘దేశీ బాయ్స్’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిందీ బ్రెజిల్ భామ. Image: Instagram/Larissa Bonesi
ఆ తర్వాత టాలీవుడ్ ‘తిక్క’లో అవకాశం వచ్చింది. 2018లో సందీప్ కిషన్ నటించిన నెక్ట్స్ ఏంటి’లో అతిథి పాత్రలో కనిపించింది.
Image: Instagram/Larissa Bonesi
మళ్లీ ఆమె తెరపై పెద్దగా కనిపించలేదు. కానీ, ముంబయిలోనే ఉంటూ ప్రస్తుతం పలు వీడియో ఆల్బమ్స్లో నటిస్తోంది.
Image: Instagram/Larissa Bonesi
లారిస్సాకి లాస్ వెగాస్, దుబాయ్ అంటే చాలా ఇష్టమట. సమయం దొరికితే అక్కడ గడిపేందుకు ఇష్టపడుతుందట.
Image: Instagram/Larissa Bonesi
వెండితెరకు దూరంగా ఉన్నా.. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ నెటిజన్లకు చేరువగానే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Larissa Bonesi