లో బడ్జెట్‌ ధరలో రెడ్‌మీ ఫోన్! 

‘మేడ్‌ ఇన్‌ ఇండియా.. మేడ్‌ ఫర్‌ ఇండియా’ అంటూ రెడ్‌మీ తాజాగా ఓ లో బడ్జెట్‌ మొబైల్‌ను విడుదల చేసింది. వివరాలివీ..

Image: Redmi

‘రెడ్‌మీ A1+’ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డాట్‌ డ్రాప్‌ డిస్‌ప్లే ఉంది.

Image: Redmi

ఇందులో మీడియాటెక్‌ హీలియో ఏ22 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉండగా.. ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

Image: Redmi

ఈ 4జీ మొబైల్‌ 2 జీబీ ర్యామ్‌ / 3 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో లభించనుంది. వర్చువల్‌గా మరో 2 జీబీ ర్యామ్‌ పెంచుకునే సదుపాయముంది. 

Image: Redmi

వెనుకవైపు 8 ఎంపీ ఏఐ డ్యుయల్‌ కెమెరా ఉండగా.. ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Image: Redmi

ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. స్టాండ్‌బైలో 30 రోజులు ఉంటుందని సంస్థ చెబుతోంది.

Image: Redmi

అన్‌లాకింగ్‌ కోసం వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ అమర్చారు. బాడీకి లెదర్‌ టెక్చర్‌ ఇవ్వడం విశేషం.

Image: Redmi

బ్లూ, గ్రీన్‌, బ్లాక్‌ రంగుల్లో లభించనుంది. 2జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 6,999.. 3 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 7,999. అక్టోబర్‌ 17 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Image: Redmi

దాంపత్యంలో సోషల్‌ మీడియాతో తిప్పలు..

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

Eenadu.net Home