#eenadu
అక్షయ తృతీయ సందర్భంగా పెరిగిన ధరలతో సంబంధం లేకుండా బంగారు, వెండి ఆభరణాల కొనుగోళ్లు భారీగా జరిగాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని ఓ దుకాణంలోని చిత్రమిది.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ రైతులను ఆకట్టుకున్నాయి.
సింహాచలంలో వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి జయంతి మహోత్సవం సందర్భంగా బుధవారం పిడుగురాళ్లలోని అమ్మవారిని రంగురంగుల గాజులతో అందంగా అలంకరించారు.
కాంచీపురం: పంచగంగ సరస్సులో నిర్వహించిన కార్యక్రమాన్ని తిలకిస్తున్న వేదపండితులు, ప్రముఖులు
అనంతపురం నగరంలోని అశోక్నగర్ హరిహర దేవాలయం, శ్రీరమా సమేత సత్యనారాయణ దేవ స్థానంలో మహిళా మండలి ఆధ్వర్యంలో అక్షయ పాత్రలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి సామూహిక కుంకుమార్చన జరిపారు.
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం చిన్నయానం పరిసర ప్రాంతాల్లోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు వెనుక జలాల్లో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి.
చింతపల్లి మండలంలో వాటర్ యాపిల్స్ నోరూరిస్తున్నాయి. కొందరు గిరిజన రైతులు వీటిని ఇళ్ల పరిసరాలు, పొలాల్లో పెంచుతున్నారు.