#eenadu
గుంటూరు నగరంలోని కలెక్టరేట్, కోర్టు, పరేడ్ గ్రౌండ్ రహదారులకు ఇరువైపులా గోడలు యోగాసన చిత్రాలతో కళకళలాడుతున్నాయి.
ఆంధ్రా ఊటీగా పేరొందిన బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది.
సాధారణంగా ఒక మామిడి చెట్టుకు ఒకటి లేదా రెండు రకాల పండ్లే కాస్తుంటాయి. గుజరాత్లోని అమ్రేలీ జిల్లా దిట్ల గ్రామంలో ఓ చెట్టుకు 12 రకాల పండ్లు కాస్తున్నాయి.
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం వద్ద ఆదివారం దర్శనానికి బారులుదీరిన భక్తులు
తమిళనాడులోని వేలూరు జిల్లాలో భారీ మురుగన్ విగ్రహానికి ఆదివారం మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది.
జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యాటకులు కేరింతలు కొట్టారు. సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.