#eenadu
హెరిటేజ్ వాక్’ నేపథ్యంలో పాతబస్తీ ముస్తాబైంది. మువ్వన్నెల జెండా రంగుల్లో విద్యుత్ కాంతులతో చార్మినార్ను అలంకరించారు. పరిసరాలు విద్యుద్దీపాలతో ధగధగలాడుతున్నాయి. లాడ్బజార్ సైతం జిగేల్ మంటోంది.
బాపట్లలో భావనారాయణస్వామి రథోత్సవాన్ని సోమవారం కనులపండువగా నిర్వహించారు.
#eenadu
శ్రీకాళహస్తి: పున్నమి సందర్భంగా శివపార్వతుల చెంతనే అత్యంత అద్భుతంగా దర్శనమిస్తున్న చంద్రబింబం .
అందాల పోటీల నేపథ్యంలో నగరానికి విదేశీయుల రాక పెరిగింది. వారంతా పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ముఖ్యంగా చార్మినార్ పరిసరాల్లో వారి సందడి కనిపిస్తోంది.
తిరుమలలో సోమవారం రాత్రి వైశాఖ పున్నమి గరుడసేవ వైభవంగా జరిగింది. స్వామివారు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు
కోనసీమలో వివాహ పందిళ్లు, వేదికల తీరు మారుతోంది. కేరళ తరహాలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పందిళ్లు, వేదికలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్న భారీ అంతస్తుల భవనాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లు. ప్రభుత్వం వాటి నిర్మాణం పూర్తి చేసి ప్రజల సొంతింటి కలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.