చిత్రం చెప్పేవిశేషాలు
(19-12-2024)
సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.
మన్యంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.
మంచిరేవుల, నార్సింగి, ఓఆర్ఆర్ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఆకాశహర్మ్యాలు, దూసుకెళ్లే రహదారులతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి.
చలి తీవ్రత కారణంగా పొగమంచుతో పాటు గాలిలో కలిసి వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. నోరు, ముక్కు, కళ్లకు రక్షణ కల్పించేలా ప్రత్యేకమైన మాస్కులు ధరించి వెళుతున్నారు.
మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు క్రిస్మస్ సంబరాల్లో సందడి చేశారు.