చిత్రం చెప్పే విశేషాలు
(29-03-2023/1)
మన్యంలో కురిసిన వర్షానికి మంగళవారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలంలోని బాసంగి గ్రామంలో ఎం.రామినాయుడుకు చెందిన పూరిపాకపై పెద్ద చెట్టు కూలింది. రాత్రిపూట పడి ఉంటే ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Source: Eenadu
నగరంలోని సీఏఎం హైస్కూలు ప్రాంతంలోని మలుపులో పంట కాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఓ వైపు కుంగిపోయింది. భారీ వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Source: Eenadu
సరదాలు పక్కనపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షల బడలిక తీరగానే ఇలా చిందేశారు. మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో సికింద్రాబాద్లోని ఓ కేంద్రం వద్ద విద్యార్థినులు సందడిగా గడిపారు.
Source: Eenadu
హైదరాబాద్లో 50 చెరువుల సుందరీకరణకు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన బిల్డర్లను మంత్రి కేటీఆర్ అభినందించి ఖాజాగూడ చెరువు వద్ద మంగళవారం ఒప్పంద పత్రాలను అందజేశారు. అధికారులు ఖాజాగూడ తటాకంలో డ్రోన్ ద్వారా దోమలు, లార్వా నివారణ మందు చల్లించారు.
Source: Eenadu
పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా.. ఫ్రాన్స్లో మిన్నంటిన ఆందోళనలు
Source: Eenadu
విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలను సమర్థంగా తిప్పికొట్టేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(స్వాట్) పేరుతో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీన్ని ఫిబ్రవరి 1న ఎస్పీ జి.ఆర్.రాధిక ప్రారంభించారు.
Source: Eenadu
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలో వేసవిలోనూ మబ్బులు కనువిందు చేస్తున్నాయి. ఉదయం దట్టంగా పొగమంచు, మధ్యాహ్నం ఎండ, తర్వాత వర్షం పడుతోంది. చెరువులవెనం, లంబసింగిలో పొగమంచును ఆస్వాదించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు వస్తున్నారు.
Source: Eenadu
నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద ఇన్నాళ్లు ఉన్న డివైడర్ను తొలగించి ఇలా రోడ్డు వేస్తున్నారు.
Source: Eenadu