చిత్రం చెప్పే విశేషాలు
(09-06-2023/2)
నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ల పెళ్లిరోజు నేడు. ప్రేమికులుగా ఉన్న వీరిద్దరు గతేడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా తన భర్త విఘ్నేష్తో దిగిన ఫొటోలను నయన్ ట్విటర్లో పంచుకున్నారు.
గుంటూరు జిల్లా నంబూరులోని హజ్ క్యాంప్ వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాత్రికులకు మిఠాయిలు, యాత్రలో ఉపయోగపడే వస్తువుల కిట్ను అందజేశారు.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ నెల 10న 108 థియేటర్లలో సినిమా టీజర్ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫైనల్ కంటెంట్ చెకింగ్ పూర్తయిదంటూ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ ఓ ఫొటోను పంచుకున్నారు.
నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ల పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ తన పిల్లలతో దిగిన ఫొటోలను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ‘వీళ్లే నా ప్రపంచం’ అని ట్వీట్ చేసింది.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపీ ఎన్జీవో, ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఇండియా జువెల్లరీ డైమండ్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నగలు, బంగారు ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరవాసులు, వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు..
సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్రావు 30 మంది దివ్వాంగులకు ట్రై స్కూటీలను అందించారు. ఈ సందర్భంగా వారు స్కూటీలను నడిపి ఆనందం వ్యక్తం చేశారు.
హీరో మహేశ్ బాబు తన తాజా ఫొటోలను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. కొత్త లుక్లో కనిపిస్తున్న ఈ ఫొటోలను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
హాంకాంగ్లోని విక్టోరియా హార్బర్లో డచ్ కళాకారుడు ఫ్లోరెంటిజన్ హాఫ్మన్ రూపొందించిన ‘డక్స్’ ఆర్ట్ ఇన్స్టాలేషన్ను చూపరులు ఆసక్తిగా తిలకించారు.