చిత్రం చెప్పే విశేషాలు!

(26-07-2022/2)

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ఆయన సతీమణి అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి ప్యారిస్‌ వెళ్లారు. అక్కడి అందాలు, రుచులు ఆస్వాదిస్తూ అనుష్క తన ఇన్‌స్టా ఖాతాలో ఫొటోలను పోస్ట్ చేస్తోంది.

Source: Eenadu

నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభకాంక్షలు తెలియజేశారు.

Source: Eenadu

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ ఏపీసీసీ ‘సత్యాగ్రహం’ చేపట్టింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లోని జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ పాల్గొన్నారు.

Source: Eenadu

ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తడంతో మూసీ నది కాలువల్లో వర్షం నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హైకోర్టు సమీపంలోని మూసీ నదిలో నీరు ఇలా పొంగిపొర్లుతోంది.

Source: Eenadu

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

Source: Eenadu

జర్మనీ దేశం బ్రూన్‌స్విక్‌ పట్టణంలోని ఓ సూపర్‌ మార్కెట్లోకి కారు ఇలా దూసుకెళ్లింది. డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్న ఓ వృద్ధుడు పార్కింగ్‌ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి కారు ఇలా లోపలికి వెళ్లింది. ఈ ఘటనలో పలువురు గాయాలపాలైనట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.

Source: Eenadu

సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మాడ వీధుల్లోనే వాహన సేవలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

Source: Eenadu

కార్గిల్‌ విజయ దివస్‌ను పురస్కరించుకొని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. నాటి సైనికుల సేవను, త్యాగాన్ని స్మరిస్తూ ఆయన సెల్యూట్‌ చేశారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home