చిత్రం చెప్పే విశేషాలు..!

(28-07-2022/2)

పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళుతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు తెలంగాణలోని పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట మండలాల ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Image: Eenadu

నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి అవుకు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. మోకాళ్ల లోతు గుంతల్లో ప్రయాణాలు సాగించలేక అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

Image: Eenadu

కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి గంగుల కమలాకర్‌ పర్యటించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వరదల కారణంగా విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు పరిశుభ్రత పాటించాలని సూచించారు.

Image: Eenadu

నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే సాగర్‌ జలాశయానికి అదనంగా నీరు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Image: Eenadu

ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మిదొడ్డిలోని దేవతా మూర్తుల వద్ద పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు.

Image: Eenadu

మూసీ వరదల కారణంగా హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌ వంతెనపై రెండు రోజులపాటు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం నీటి ఉద్ధృతి తగ్గడంతో వంతెనపైకి కొట్టుకొచ్చిన ఇనుప జాలీలు, బండరాళ్లను తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమయ్యారు.

Image: Eenadu

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన ఈయన పేరు కాశిరెడ్డి. తన కావడిలో గతంలో ఉపయోగించే బిందెలు, కడవలు కాకుండా ప్లాస్టిక్‌ క్యాన్లు వినియోగిస్తూ చుట్టుపక్కలి వారిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారిలా..

Image: Eenadu

అవయవాల తరలింపు కోసం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ హాస్పటల్ వరకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. దీంతో లక్డీకపూల్‌ వద్ద ఇలా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Image: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home