చిత్రం చెప్పే విశేషాలు! (20/08/2022)

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం కడపలో కౌలు రైతు భరోసా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దదిక్కును కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

image:Eenadu

శ్రీ‌కృష్ణ జ‌న్మాష్టమి వేడుక‌ల్లో భాగంగా తిరుమలలో శ‌నివారం ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు.

image:Eenadu

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు.. మంత్రి రోజాను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోజా కుటుంబ సభ్యులతో కలిసి సింధు లంచ్‌ చేశారు.

image:Eenadu 

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో నటి రియా సుమన్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

image:Eenadu

మునుగోడు బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ ర్యాలీగా చాలా వాహనాలతో కదిలివెళ్లింది. ర్యాలీలో భాగంగా ఉప్పల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి డ్యాన్స్‌ చేసి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు.

image:Eenadu

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్‌ మండలం పొర్లుగడ్డ తండాలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

image:Eenadu

కార్తికేయ2 సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా హీరో నిఖిల్‌, చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

image:Eenadu

విజయవాడలోని సి.కె ఫంక్షన్‌ హాల్‌లో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ తదితరులు పాల్గొన్నారు.

image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home