చిత్రం చెప్పే విశేషాలు..!

(05-08-2022/2)

హైదరాబాద్‌ పేట్లబుర్జు ఆస్పత్రిలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాలకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వార్డును పరిశీలించారు.

Source: Eenadu

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరింది. ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో పెద్ద రావులపల్లి - భట్టుగూడెం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న మూసీ నదిని బండి సంజయ్‌ పరిశీలించారు.

Source: Eenadu

తెలంగాణ ఇంటి పార్టీ (తెఇపా) వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.

Source: Eenadu

శ్రావణ శుక్రవారం సందర్భంగా చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

కరేబియన్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్‌ హార్దిక్ పాండ్య వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ను కలిశారు. ఈ ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న హార్దిక్‌ పాండ్య.. పొలార్డ్‌ ఇంటికి వెళ్లకుండా కరేబియన్‌ పర్యటన ఎప్పుడూ పూర్తి కాదని తెలుపుతూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

ధరల పెరుగుదలను నిరసిస్తూ ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

Source: Eenadu

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Source: Eenadu

స్విట్జర్లాండ్‌లోని రైన్‌ జలపాతం శుక్రవారం ఇలా పొంగిపొర్లుతూ కనిపించింది. యూరప్‌లోకెల్లా పొడవైన ఈ జలపాతం అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు.

Source: Eenadu

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 500 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.

Source: Eenadu

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. మరోవైపు దీదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

Source: Eenadu

ఏపీ మంత్రి, సినీ నటి రోజా శ్రావణ శుక్రవారం సందర్భంగా యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకొని వరలక్ష్మీ వ్రతం, కోటి కుంకుమార్చనలో పాల్గొన్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు(28-03-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (28-03-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(27-03-2024/1)

Eenadu.net Home