చిత్రం చెప్పే విశేషాలు..!

(11-11-2022/2)

హైదరాబాద్‌లోని వై జంక్షన్‌ మూసివేయడంతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మెట్రో సేవలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు రోడ్డు రవాణాను ఆశ్రయించడంతో రద్దీ మరింత పెరిగింది.

Source: Eenadu

అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ ఎలెన్‌ దిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించారు.

Source: Eenadu

ప్రధాని నరేంద్రమోదీ బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా 108 అడుగుల ఎత్తయిన నాద ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Source: Eenadu

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ టాలీవుడ్‌లో తన ప్రస్థానం ప్రారంభించి నేటికి రెండు దశాబ్దాలు పూర్తైంది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

Source: Eenadu

ఓ వైపు నూతన సచివాలయం, మరో వైపు ఫార్ములా వన్‌ రేసు కోసం ప్రత్యేక రహదారి నిర్మాణం కొనసాగుతోంది. ఈ పనుల్లో శ్రామికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అలా అలసిన ఓ శ్రామికురాలు ఇలా పాత టైర్లను పాన్పుగా చేసుకొని సేద తీరుతూ కనిపించింది.

Source: Eenadu

 శనివారం ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనుండటంతో విమానాశ్రయంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు.

Source: Eenadu

హైదరాబాద్‌ నగరవాసులు జన్మదిన వేడుకలను అర్ధరాత్రి వేళ రోడ్లపై, పార్కులు, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో జరుపుకొంటూ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌పై గురువారం రాత్రి కనిపించిన వేడుకల చిత్రాలివి.

Source: Eenadu

ఈ ఎమ్మెల్యేను గుర్తు పట్టారా?మీకు బాగా తెలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. అదేనండి భారీ గడ్డం, పొడవైన వెంట్రుకలతో కనిపించే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇవ్వడంతో ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

Source: Eenadu

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home