చిత్రం చెప్పే విశేషాలు!

(17-11-2022/2)

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Source: Eenadu

బోస్నియాలోని సరజెవో నగరంలో కాలుష్యం, పొగమంచు కలిసి ఇలా చీకటి అలముకున్నట్లు కనిపించింది. వాటి మధ్య నుంచి చిన్నగా సూర్యుడి కిరణాలు ప్రసరించాయి.

Source: Eenadu

మహారాష్ట్రలో సాగుతున్న భారత్‌ జోడో యాత్రలో సినీనటి రియాసేన్‌ పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీతో కలిసి ఆమె పాదయాత్ర చేశారు.

Source: Eenadu

హైదరాబాద్‌ ఎన్టీఆర్ మార్గ్‌లో శని, ఆదివారాల్లో జరగనున్న ఫార్ములావన్ రేసింగ్‌ కోసం వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన రేసర్లు కార్లతో హైదరాబాద్‌ చేరుకున్నారు.

Source: Eenadu

అమెరికాలో ఉన్న కృష్ణ మనమడు జయకృష్ణ(రమేష్‌ కుమారుడు) తన తాత పార్థివ దేహాన్ని చూసేందుకు బయలుదేరినా.. ఆలస్యం కావడంతో చివరి చూపు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని కృష్ణ నివాసంలో చిత్రపటానికి నివాళి అర్పించాడు.

Source: Eenadu

తన జన్మదినం సందర్భంగా మంత్రి రోజా గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్దస్త్ టీమ్‌తో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Source: Eenadu

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ప్రహ్లాద్‌ జోషికి అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని వోల్వో షోరూమ్‌లో ఆ సంస్థ ఎలక్ట్రిక్‌ కారును తొలిసారిగా విక్రయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ సాయిలిఖిత యలమంచిలి పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు.

Source: Eenadu

గమనిక: ఇది ప్రయత్నించకండి

బాక్సర్‌ మీనాక్షి

ఈవీఎంలు ఇలా పుట్టుకొచ్చాయి!

Eenadu.net Home