చిత్రం చెప్పే విశేషాలు!

(02-08-2022/2)

శ్రమదానం కార్యక్రమం ద్వారా తిరుమలను స్వచ్ఛ తిరుమలగా మార్చుకుందామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలలోని బాలాజీ నగర్‌లో ఆయన అధికారులు, సిబ్బంది, స్థానికులతో కలిసి శ్రమదానం చేశారు.

Source: Eenadu

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతిని పురస్కరించుకొని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. పింగళి వెంకయ్య జీవితంపై ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

Source: Eenadu

ఫ్యాషన్‌ ప్రియుల కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరీ జైపుర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవానికి నటి, బిగ్‌బాస్‌ ఫేం స్రవంతి చొక్కారపు, ఇతర మోడళ్లు హాజరయ్యారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్‌లోని సెవెన్‌ టెంపుల్స్‌ నాగులపుట్ట వద్ద పూజలు చేసి, పాలు పోస్తున్న భక్తులు.

Source: Eenadu

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రిలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వంగపల్లి బహిరంగ సభలో పాల్గొన్నారు.

Source: Eenadu

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు.

Source: Eenadu

నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మల్లయోధులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజున నాగదేవతను ఆరాధించి కుస్తీలోకి దిగడం అక్కడి ఆనవాయితి.

Source: Eenadu

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాని.

Source: Eenadu

మై హార్ట్‌ ఈజ్‌ మిస్సింగ్‌

వైట్‌ ఎండ్‌ వైట్‌లో అలా..

చిత్రం చెప్పే విశేషాలు (19-05-2024/1)

Eenadu.net Home