100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4

నార్డ్‌ సీఈ 4 ఫోన్‌ ఏప్రిల్‌ 1న భారత్‌లో లాంచ్‌ అయ్యింది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఓఎస్‌తో ఫోన్‌ వస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ అమర్చారు.

6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది.

5,500 mAh బ్యాటరీ 100W సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లోపు ఫుల్‌ బ్యాటరీ ఛార్జ్‌ చేయొచ్చు.

50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్‌, 8 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 355 అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఇందులో ఉన్నాయి.

8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.24,999, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా పేర్కొంది.

డార్క్‌ క్రోమ్‌, సెలాడన్‌ మార్బుల్‌ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్‌ 4 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా నార్డ్‌ సీఈ4 కొనుగోలుపై వన్‌ప్లస్‌ నార్డ్‌ 2ఆర్‌ ఇయర్‌ బడ్స్‌ను ఉచితంగా అందించనున్నట్లు వన్‌ప్లస్‌ పేర్కొంది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్లు ట్రై చేశారా?

ఈ దేశాల్లో టిక్‌టాక్‌ నిషేధం!

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Eenadu.net Home