చిత్రం చెప్పే విశేషాలు..!
(29-01-2023/1)
ముఖ్యమంత్రి జగన్ భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. ఈనెల 30న సీఎం పల్నాడు జిల్లా వినుకొండ వస్తున్నారు.
source:eenadu
సైఫాబాద్ ప్రధాన రహదారిలో ఓ ఆర్టీసీ బస్సు పాడైపోవడంతో డ్రైవర్ రోడ్డుపక్కన నిలిపాడు. ఇంతలో అటుగా వచ్చిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చలానా వేసేందుకు ఫొటో తీసుకున్నాడు.
source:eenadu
మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులకు పట్టడం లేదు. బీకేగూడలో శనివారం ఓ బాలుడు ద్విచక్ర వాహనాన్ని రహదారిపై నడుపుతూ ఇలా కనిపించాడు.
source:eenadu
చారిత్రక విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీ వీధుల్లో యువతీయువకుల కుస్తీపోటీలు ప్రారంభమయ్యాయి.
source:eenadu
శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి సందర్భంగా శనివారం తీరానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సముద్రస్నానాలు చేసి సూర్యునికి పూజలు చేశారు.
source:eenadu
అనంతపురం జిల్లాలోని డి.హీరేహాళ్లో పవనసుతుడి ఊరేగింపు
source:eenadu
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ సాంస్కృతిక, సంగీత సంస్థ వ్యవస్థాపకుడు తడకమళ్ల రామరంగారావు యోగా సాధన చేస్తూ నీటిపై పద్మాసనం, సుఖాసనంతో వేశారు.
source:eenadu
హైదరాబాద్ నగరంలో చలి మళ్లీ పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో రోగుల సంబంధీకులు పడుకోవడానికి ఏర్పాటు చేసిన షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో పలువురు ఇలా కాలిబాటపై నిద్రించారు.
source:eenadu
సికింద్రాబాద్-దిల్సుఖ్నగర్ మార్గంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు అత్యంత ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్నారు.
source:eenadu