చిత్రం చెప్పే విశేషాలు..!
(26-01-2023/2)
కల్యాణ్రామ్ హీరోగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమిగోస్’. అశికా రంగనాథ్ కథానాయిక. ఈ సినిమాలోని ‘ఎన్నో రాత్రులొస్తాయి’ పాటను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
source:EENADU
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి వెలుగులోకి రాని వీరులకు అంకితమిస్తూ ‘సత్య’ అనే వీడియో పాటను త్వరలో విడుదల చేస్తున్నట్లు దిల్రాజు ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఇందులో సాయిధరమ్ తేజ్, స్వాతి నటించనున్నారు.
source:EENADU
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో దుర్గం చెరువు తీగల వంతెన నుంచి సైకిల్ రైడ్ నిర్వహించారు.
source:EENADU
సినీనటుడు రవితేజ జన్మదినం సందర్భంగా ప్రముఖ నటుడు చిరంజీవి ఆయనకు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
source:EENADU
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ కథానాయిక. చిత్ర టీజర్ను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
source:EENADU
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫొటోను తన ట్విటర్లో ఖాతాలో పంచుకున్నారు. ‘షోలే 2’ త్వరలో రాబోతోందని పాండ్యా ఫన్నీగా పోస్టు పెట్టారు.
source:EENADU
వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా‘సైంధవ్’. ఈ సినిమా చిత్రీకరణ గురువారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. కార్యక్రమంలో సినీనటుడు రానా పాల్గొన్నారు.
source:EENADU
సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
source:EENADU
బాసరలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
source:EENADU
తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్తో కలిసి ఆయన స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు.
source:EENADU
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
source:EENADU
మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.
source:EENADU
రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
source:EENADU