అరవింద @ శ్రీలంక

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం విహారయాత్రలో ఎంజాయ్‌ చేస్తోంది. 

Image: Instagram/Pooja Hegde

షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చి తాజాగా శ్రీలంకకు వెళ్లింది పూజ. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. 

Image: Instagram/Pooja Hegde

శ్రీలంకలోని ఓ బీచ్‌లో చక్కర్లు కొడుతూ దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దానికి ‘లవ్‌ యూ జిందగీ’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

Image: Instagram/Pooja Hegde

అంతకుముందు ఓ హోటల్‌లో వంటకాలు రుచి చూసింది. పీతలతో చేసిన వంటకం చాలా బాగుందని మరో పోస్టు పెట్టింది పూజ. 

Image: Instagram/Pooja Hegde

సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ఈమె నటించిన ‘కీసీ కా భాయ్‌.. కీసీ కీ జాన్‌’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

Image: Instagram/Pooja Hegde

సినిమా ప్రమోషన్స్‌ పూర్తి కాగానే.. ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు వేడుకలో సందడి చేసింది పూజ. సిల్వర్‌ రంగు డ్రెస్‌లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Image: Instagram/Pooja Hegde

ప్రస్తుతం ఈ బ్యూటీ మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న #SSMB28లో నటిస్తోంది.

Image: Instagram/Pooja Hegde

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు రామ్‌చరణ్‌తో కలిసి పూర్తిస్థాయిలో ఓ చిత్రం చేయాలని ఉందని చెప్పింది. 

Image: Instagram/Pooja Hegde

ఇది వరకు ‘రంగస్థలం’లోని ‘జిగేలు రాణి’ పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ‘ఆచార్య’లో తక్కువ నిడివితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ‘కిసీ కా భాయ్‌..’లోని ఓ పాటలోనూ రామ్‌చరణ్‌ కనిపించాడు. 

Image: Instagram/Pooja Hegde

త్వరలోనే రామ్‌చరణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. 

Image: Instagram/Pooja Hegde

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home