దటీజ్‌ సింధు.. ఈసారి స్వర్ణం తెచ్చింది!

తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్‌లో అదరగొట్టింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచింది.

Image: AP

ఫైనల్స్‌లో కెనడా షట్లర్‌ మిచెలీ లీని 21-15, 21-13 పాయింట్లతో ఓడించి విజేతగా నిలిచింది.

Image: AP

ఈ వేదికపైనే బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో రజత పతకం నెగ్గింది.

Image: Instagram/PV Sindhu

గత కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ భారత్‌కు పతకాలు అందించింది సింధు.

Image: Instagram/PV Sindhu

2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది.

Image: Instagram/PV Sindhu

గోల్డ్‌కోస్ట్‌ వేదికగా 2018లో నిర్వహించిన కామన్వెల్త్‌ పోటీల్లో మహిళల సింగిల్స్‌లో రజతం గెలిచింది. అలాగే, మిక్స్‌డ్‌ టీంలో స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

Image: Instagram/PV Sindhu

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు.. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

Image: Instagram/PV Sindhu

2018 ఆసియా గేమ్స్‌లో రజత పతకం సాధించింది సింధు.

Image: Instagram/PV Sindhu

జులైలో జరిగిన సింగపూర్‌ ఓపెన్‌లో గెలుపొంది తొలి సూపర్‌ 500 టైటిల్‌ నెగ్గింది.

Image: Instagram/PV Sindhu

ఈ ఏడాదిలోనే సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌, స్విస్‌ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 300 టైటిళ్లను సొంతం చేసుకొని విజయయాత్ర కొనసాగిస్తోంది.

Image: Instagram/PV Sindhu

సిక్సుల మోత.. హైదరాబాద్‌ మ్యాచే టాప్‌

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్స్‌ ఇవీ!

అందాల షెఫాలీ బగ్గా..

Eenadu.net Home