ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో ఆకట్టుకుంటోంది శ్రద్ధాకపూర్‌. ప్రస్తుతం ‘స్త్రీ 2’తో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావు కథానాయకుడు. హార్రర్‌ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కింది.

బాలీవుడ్‌లో శ్రద్ధాకపూర్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏడాదికి రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉంటోంది.

2024 పింక్‌ విల్లా స్క్రీన్‌ అండ్‌ స్టైల్‌ ఐకాన్‌ అవార్డులో ‘మోస్ట్ స్టైలిష్‌ ఫ్యాన్‌ ఫేవరెట్‌ సూపర్‌ స్టార్‌’ టైటిల్‌ను గెలుచుకుంది.

‘సాహో’తో ప్రభాస్‌ సరసన పోలీస్‌ పాత్రలో నటించి తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది.

మ్యాగజైన్‌ కవర్లకు పోజులిస్తూ ఉంటుంది. పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది.

This browser does not support the video element.

‘నేనో ఫుడీని. నిరంతరం ఏదో ఒకటి తింటూనే ఉంటా. ఎన్నున్నా జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే. దానికి తగ్గట్టుగానే ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేసేందుకు జిమ్‌ చేస్తా’ అని అంటోంది.

సోషల్‌ మీడియాలో ఈమె క్రేజే వేరు. ఫ్యాన్‌ బేస్‌ ఓ లెవెల్‌లో ఉంటుంది. ఇన్‌స్టాలో శ్రద్ధాను 9 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

పెంపుడు జంతువులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. శునకాలతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది.

అమితాబ్‌ బచ్చన్‌, హృతిక్‌ రోషన్‌, శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల నటన అంటే ఇష్టమట.

This browser does not support the video element.

పండుగలు, ప్రత్యేక రోజులను కుటుంబంతో సెలబ్రేట్‌ చేసుకునేందుకే ఇష్టపడుతుంది.

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home