అందమైన అతిథి
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఓ ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకుంది. అదేనండీ.. బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 పట్టాభిషేకానికి సోనమ్ను ఆహ్వానించారు. మే 6న ఈ వేడుక జరగనుంది.
Image: Instagram/Sonam Kapoor Ahuja
దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. భారతీయ సినీపరిశ్రమ తరఫున తనని పిలిచారనుకున్నా... ప్రస్తుతం సోనమ్ లైమ్లైట్లో లేదు.
Image: Instagram/Sonam Kapoor Ahuja
అయినా సోనమ్నే ఆహ్వానించడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. తనపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
Image: Instagram/Sonam Kapoor Ahuja
ఈ భామ.. బ్రిటన్లో నివసిస్తున్న ఆనంద్ అహుజాను 2018లో వివాహం చేసుకుంది.
Image: Instagram/Sonam Kapoor Ahuja
పెళ్లయిన తర్వాత సినిమాలు చేయడం తగ్గించిన సోనమ్.. మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది.
Image: Instagram/Sonam Kapoor Ahuja
గతేడాది సోనమ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కొన్నాళ్లుగా కుమారుడు వయూ సంరక్షణకే పరిమితమైంది.
Image: Instagram/Sonam Kapoor Ahuja
అప్పుడప్పుడు ఫ్యాషన్ దుస్తుల్లో తళుక్కుమంటోంది. సోనమ్ భర్త అహుజాకు బ్రిటన్ కేంద్రంగా ఫ్యాషన్ రంగంలో పలు వ్యాపారాలున్నాయి.
Image: Instagram/Sonam Kapoor Ahuja
సోనమ్ - అహుజా బ్రిటన్లో స్థిరపడటం.. ఇద్దరూ ప్రముఖులే కావడంతో వీరికి ఆహ్వానమంది ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.
Image: Instagram/Sonam Kapoor Ahuja
ఛార్లెస్ 3 పట్టాభిషేకం వేడుకకు సోనమ్.. కేవలం అతిథిగా వెళ్లడం కాదు, కామన్వెల్త్ దేశాల తరఫున ప్రసంగించనుందట.
Image: Instagram/Sonam Kapoor Ahuja
ఇక సోనమ్ సినిమాల విషయానికొస్తే.. ‘బ్లైండ్’తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Image: Instagram/Sonam Kapoor Ahuja