ఈ ఆలయాల గురించి విన్నారా?

భరతమాత ఆలయం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న మహాత్మా గాంధీ విద్యాపీఠ్‌లో ఉందీ ఆలయం. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల స్మారకంగా దీన్ని 1936లో నిర్మించారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆలయాలు వెలిశాయి. 

Image: Google Maps

బుల్లెట్‌ బాబా మందిర్‌

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఓం సింగ్‌ రాథోడ్‌ బుల్లెట్‌పై వెళ్తూ ఓ చోట ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఆయన బుల్లెట్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొస్తే మాయమై ప్రమాదం జరిగిన చోటకి వచ్చేసిందట. అక్కడే బుల్లెట్‌కు పూజలు చేస్తున్నారు.

Image: Google Maps

ఏరోప్లేన్‌ గురుద్వారా

విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఈ గురుద్వారాలో ఏరోప్లేన్‌ బొమ్మను కానుకగా ఇస్తే.. వారికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయట. వీసా ఇబ్బందులేవి రావట. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ గురుద్వారా ఉంది.

Image: Google Maps

హిడింబా దేవి ఆలయం

పంచ పాండవుల్లో ఒకరైన భీముడి భార్యే హిడింబా. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో హిడింబా ఏళ్ల తరబడి తపస్సు చేసి దేవతగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. 1553లో అప్పటి మహారాజు బహదూర్‌ సింగ్‌ దీన్ని నిర్మించారు. 

Image: Google Maps

మలనాడ ధుర్యోధన ఆలయం

కేరళలోని కొల్లాంలో కౌరవుల్లో అగ్రజుడైన ధుర్యోధనుడికి ఓ ఆలయం ఉంది. పాండవులను వెతుక్కుంటూ ధుర్యోధనుడు ఈ ప్రాంతానికి వచ్చాడట. ఆయన కూర్చున్న చోటనే ఆలయాన్ని నిర్మించారు. 

Image: Google Maps

చైనీస్‌ కాళీ

కోల్‌కతాలోని టాంగ్రా (చైనీస్‌ టౌన్‌)లో ఉందీ ఆలయం. ఇక్కడి కాళీ మాతకు భక్తులు చైనీస్‌ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. 

Image: Google Maps

చన్నపట్న డాగ్‌ టెంపుల్‌

శునకాల్ని కాళభైరవుడి రూపంలో పూజిస్తుంటాం. కర్ణాటకలోని అగ్రహార వలెగెరెహల్లిలో ఓ వ్యాపారవేత్త కెంపన్న దేవత కోసం ఆలయం నిర్మిస్తుండగా రెండు శునకాలు మాయమయ్యాయి. దీంతో వాటి విగ్రహాలను ఆలయంలో ఏర్పాటు చేశారు. 

Image: Twitter

కర్ణి మాత దేవాలయం

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఉన్న ఈ ఆలయంలో దాదాపు 25వేల ఎలుకలు తిరుగుతుంటాయి. పాలు, ఫలహారాలు ఇస్తుంటారు. ఎలుకలు వాటిని తింటే తాము అదృష్టవంతులమని భక్తులు భావిస్తారు. 

Image: Google Maps

ఈ వారం రాశిఫలం

హనుమాన్‌ ఆలయానికి ఎస్కలేటర్‌

అల్లుడి కాళ్లెందుకు కడుగుతారో తెలుసా?

Eenadu.net Home