దసరాకి తారల ధగధగ
కాజల్
‘భగవంత్ కేసరి’ అక్టోబరు 19న విడుదల అవుతోంది. ఇందులో కాజల్ కాత్యాయని పాత్రలో కనిపించనుంది.
త్రిష
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘లియో’ లో త్రిష సత్య పాత్రలో అలరించనుంది. ఇందులో విజయ్ భార్యగా నటించింది.
శ్రీలీల
‘భగవంత్ కేసరి’ లో శ్రీలీల విజయలక్ష్మి అలియాస్ విజ్జిగా నటించింది. బాలకృష్ణ కూతురిగా ప్రత్యేక పాత్ర తనది.
నూపుర్ సనన్
‘టైగర్ నాగేశ్వరరావు’ లో నూపుర్ రవితేజకు ప్రియురాలు ‘సారా’గా కనిపించనుంది. తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమౌతుంది.
గాయత్రి భరద్వాజ్
‘టైగర్ నాగేశ్వరరావు’ లో ఈ బ్యూటీ మణి పాత్రలో మెరవనుంది. ఇప్పటికే విడుదలైన ‘ఇచ్చేసుకుంటాలే’ పాటలో పల్లెటూరి పిల్లగా గాయత్రి ఆకట్టుకుంది.
అర్చన జాయిస్
‘కేజీయఫ్’లో యశ్కి తల్లిగా నటించిన అర్చన కన్నడ ‘ఘోస్ట్’తో అక్టోబరు 19న దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.
కృతి సనన్
‘గణపత్’ ఈ మూవీలో కృతి జెస్సీ పాత్ర పోషించింది. యాక్షన్ సీన్లో ఫైట్ చేసి ఆకట్టుకోనుంది. ఈ చిత్రం అక్టోబరు 20న విడుదల కానుంది.
ఎల్లి అవ్రామ్
గ్రీకుకు చెందిన ఈ భామ తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎక్కువగా నటిస్తోంది. ప్రస్తుతం ‘గణపత్’ లో రోజీ పాత్రలో నటించింది.
అనుక్రీతి వాస్
‘టైగర్ నాగేశ్వరావు’లో జయవాణి పాత్రతో టాలీవుడ్లో అడుగుపెట్టనుంది ఈ భామ.